

మృతి చెందిన ఉపాధి కూలీకి ప్రభుత్వం ఆదుకోవాలి.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ :మృతిచెందిన ఉపాధి హామీ కూలీకి ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ర్ట రైతుకూలీ సంఘం సహాయక కార్యదర్శి మహమబ్ అన్నారు . మండలంలోని జౌలీ గ్రామంలో మేక భూదేవి ఉపాధి హామీ కూలి పనికి వెళ్లి ఎండకు అస్వస్థతకు గురి అయ్యి ఈ నెల 10 న మృతి చెందిందిన విషయం తెలుసుకొని శుక్రవారం వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించి , తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీ తరపున ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా మహమూద్ మాట్లాడారు .బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం కింద ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేసిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పని చేసే స్థలంలో టెంట్లు,త్రాగునీరు,మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.