

మార్చ్ 8న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీదేవి
మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 05 : సుప్రీంకోర్టు ఉత్తర్వులు, హైకోర్టు సూచనల మేరకు రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని కోర్ట్లోనూ మార్చ్ 8వ తేదీన జాతీయ లోక్అదాలత్ను నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీదేవి తెలిపారు. బుదవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్ భవనంలో మార్చ్ 8న జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.శ్రీదేవి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని వివిధ కోర్టుల్లో అనేకమైన కేసులు పెండింగ్లో ఉన్నాయని కోర్టులో వేయని వివాద కేసులు ఉంటే అవి కూడా ముందస్తు పిటిషన్స్ ఫిర్యాదుగా స్వీకరించి సమన్యాయం అందించడానికి ఈ లోక్ అదాలత్ పాత్రను పోషిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో మార్చ్ 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామన్నారు. న్యాయమూర్తులు అందు బాటులో ఉంటారని, కక్షిదారులు కలిసేలా ప్రత్యే కంగా ఈ సమయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.కక్షిదారులు సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ, మోటారు వెహికిల్, విద్యుత్తో పాటు అన్ని రకాల కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.