

మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం
మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 13 :- కడెం మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడిగెల భూషణo కి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడంపై కడెం మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు కడెం హరిత రిసార్ట్ లో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ పార్టీ కోసం అహీర్ణశలు కృషి చేసిన పడిగెల భూషణo కి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు
కడెం మండలంకి పదవి రావడం పై ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కి మరియు రాష్ట్ర నాయకత్వం కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు అదేవిధంగా నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణo డైరెక్టర్ లు ఊరే జలజ దండుగుల యాదగిరి లక్కవత్తుల నారాయణ లకి స్వేట్లు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నూతనoగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్ లు మాట్లాడుతూ మమ్మల్ని గుర్తించి ఈ పదవి ఇవ్వడం పై ఖానాపూర్ శాసనసభ్యులు బొజ్జు పటేల్ ను కాంగ్రెస్ పార్టీ కి రుణపడి ఉంటామని ఈ పదవి మాకు మరింత బాధ్యత ని పెంచిందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారి నాయకత్వం లో పార్టీ ని మరింత బలోపేతం కి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బరుపటి రమేష్ వర్మ sc సెల్ జిల్లా అధ్యక్షులు తరి శంకర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రెంకల శ్రీనివాస్ యాదవ్ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మల్లేష్ యాదవ్ నాయకులు ముస్కు రాజు చంద్ర శేఖర్ దేవందర్ గౌడ్ షేక్ రఫిక్ బబ్లు గోస్కుల మల్లేష్ తరి గంగాధర్ గాండ్ల శేఖర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు