మానవ జీవితానికి విజ్ఞానంతోనే మనుగడ

మానవ జీవితానికి విజ్ఞానంతోనే మనుగడ

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 :- మానవ జీవితానికి విజ్ఞాన శాస్త్రంతోనే మనుగడ సాధ్యమని ప్రముఖులు అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్రా ఉన్నత పాఠశాల- సరస్వతి శిశు మందిర్- లిటిల్ ఫ్లవర్- శ్రీ అక్షర పాఠశాలల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన రోజును భారత ప్రభుత్వం జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించి జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మానవ జీవితంలో విజ్ఞాన శాస్త్రం పాత్రను వివరించేందుకు చార్ట్లు- నమూనాలను ప్రదర్శించారు. వివిధ రకాల విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల నమూనాలను తయారుచేసి విద్యార్థులు ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా జీవశాస్త్రం-భౌతిక శాస్త్రం- రసాయన శాస్త్రం లోని మానవునికి ఉపయోగపడే విషయాలను ప్రదర్శించి వివరించడం ఆకట్టుకుంది. విద్యార్థులను ప్రముఖులు అభినందించారు. విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు కష్టపడి నమూనాలు- చార్టలను తయారు ప్రదర్శించడం ఆకట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో రబింద్రా ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ ఆసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీమ్రావు దేశాయ్, శిశు మందిర్ ప్రధానాచార్యులు సారథి రాజు, లిటిల్ ఫ్లవర్ ప్రిన్సిపల్ నజీబ్ ఖాన్, కరస్పాండెంట్ దిగంబర్, శ్రీ అక్షర డైరెక్టర్ సుభాష్ పటేల్, ఉపాధ్యాయులు, ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా…

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .