మానవత్వం చాటుకున్న లోకేష్.. ఒక్క మెసేజ్ తో ఒకరికి ప్రాణదానం

మానవత్వం చాటుకున్న లోకేష్.. ఒక్క మెసేజ్ తో ఒకరికి ప్రాణదానం

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై వేగంగా స్పందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సాయం చేస్తున్నారు. లోకేష్ సేవాగుణంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా.. లోకేశ్ క్షణాల్లో స్పందించడంతో ఒకరికి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం జరుగనుంది. గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్‌కు గురి అయ్యారు. దీంతో సుష్మ కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేయడానికి నిర్ణయించుకున్నారు. సుష్మ అవయవదానంతో తిరుపతిలో మరొకరికి ప్రాణదానం జరుగనుంది. సుష్మ గుండెను తిరుపతిలోని మరొకరికి అమర్చనున్నారు. గుంటూరు నుంచి తిరుపతికి గుండెను తరలించడానికి సొంత ఖర్చులతో మంత్రి లోకేశ్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఇవాళ(గురువారం) రాత్రి 7 గంటలకు గ్రీన్ ఛానెల్ ద్వారా గుండెను గుంటూరు రమేష్ ఆస్పత్రి సిబ్బంది తిరుపతికి తరలించనున్నారు. దీంతో గుండె మార్పిడి విజయవంతం చేయడానికి వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. సకాలంలో స్పందించిన మంత్రి నారా లోకేశ్‌కు సుష్మ కుటుంబ సభ్యులు, రమేశ్ హాస్పిటల్స్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన. మనోరంజని స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన దార్ల హేమ దుర్గా ప్రసన్నను (31) గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ సాయి బలవంతంగా లోపర్చుకొని ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను…

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మచిలీపట్నంలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత… విజయవాడ: వడగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఠారెత్తాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సగటున 40 డిగ్రీలకు చేరాయి. సాధారణం కంటే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం