

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో బడంగ్పేట్ జిల్లా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి .సంస్థలోని మహిళా ఉద్యోగులను ఆయన శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలి అని ఆకాంక్షిస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు..స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని హితవు పలికారు. సంవత్సరానికి ఒకసారి మహిళలను గౌరవించడం కాకుండా ప్రతిరోజూ గౌరవించాలని వారికి సమాజంలో సామాన గుర్తింపు ఇవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పిజివి,రాణి, గ్రేడ్ 1 గ్రంథాపాలకులు ప్రతాప్, తౌసిఫ్ ,జిల్లాలోని గ్రంధాలయ పాలకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు
