

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13:మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని వికారాబాద్ మాజీ జడ్పీ ఛైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వేడుకలో ముఖ్య అతిథిగా గురువారం పాల్గొన్న పట్నం సునీత మహేందర్ రెడ్డి. అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలి అని ఆకాంక్షిస్తున్నాను. ఇక పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల ఇల్లస్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం అయ్యేలా చూడడం జరుగుతుంది.మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడిన సునీత మహేందర్ రెడ్డి.స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో కోమరెళ్ళి , ఉమాదేవి , సూర్యకళ, కల్యాణ సుందరి తదితరులు పాల్గొన్నారు
