మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

ఇంటర్నెట్ డెస్క్: మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. 48 గంటల్లో భూకంపం రావడం ఇది రెండోసారి. మెుదటగా శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూ విలయం మయన్మార్‌ను కుదిపేసింది. శక్తిమంతమైన భూకంపం ధాటికి 1,664 మంది ప్రాణాలు కోల్పోగా.. 3,408 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాల కింద చిక్కుకున్న పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. కొండ ప్రాంతాలు, రెబల్స్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరణాలను అధికారులు ఇంకా లెక్కించలేదు. వాటినీ పరిగణనలోకి తీసుకుంటే మృతుల సంఖ్య ఏకంగా 10 వేలు దాటే అవకాశం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే(యూఎస్జీఎస్‌) వెల్లడించింది. మయన్మార్‌ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం పడింది. పదుల కొద్దీ భవంతులు నెలమట్టం అయ్యాయి. వేల మంది నిరాశ్రయులు అయ్యారు. భవనాలు కూలిపోయిన సంఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఆదివారం ఉదయం ఇండోనేషియాలోనూ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. సుమత్ర దీవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు

  • Related Posts

    బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

    బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం హైదరాబాద్: థాయ్‌లాండ్, మయన్మార్ దేశాల్లో చోటు చేసుకున్న వరుస భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చాయి. శుక్రవారం నాడు సంభవించిన భూకంపాల ధాటికి.. వందల నిర్మాణాలు కుప్పకూలాయి. మయన్మార్, థాయ్‌లాండ్ రెండు దేశాల్లో…

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    మనోరంజని ప్రతినిధి మార్చి 29 – సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనమైనట్లు అధికారికంగా ప్రకటించారు. దీని ప్రకారం, అక్కడ రంజాన్ పర్వదినం రేపు (ఆదివారం) జరుపుకోనున్నారు. భారతదేశంలో నెలవంక వీక్షణ ఆధారంగా రంజాన్ పండుగ సోమవారం (ఏప్రిల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం