

భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 21 :- నిర్మల్ జిల్లా భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్ను సెప్టెంబర్ 26, 2024న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ తనిఖీ చేశారు. ఆమె మొదటగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్లోని సిబ్బంది యొక్క డ్రిల్ సమీక్షించి, ప్రతి శనివారం డ్రిల్ పరేడ్లో పాల్గొనాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ వాహనాలు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి, కేసుల దర్యాప్తులో అలసత్వం వహించొద్దని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులకు వెంటనే స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.నారి శక్తి మరియు పోలీస్ అక్క ప్రోగ్రామ్లలో పాల్గొంటున్న మహిళా సిబ్బందిని అభినందించిన ఎస్పీ, డయల్ 100 కాల్స్కి తక్షణ స్పందన అవసరమని అన్నారు. స్టేషన్ పరిధిలో గంజాయి, అక్రమ ఇసుక, పిడియాస్ రైస్ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కార్యక్రమం ముగింపు సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అవినాష్ కుమార్ ఐపిఎస్, సి.ఐ నైలు, గోపినాథ్, ఎస్.ఐ రవీందర్, భాస్కరా చారి, ప్రొబేషనరీ ఎస్.ఐ సుప్రియ తదితరులు పాల్గొన్నారు


