

బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు.
మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 29 :-*మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు శనివారం ఏర్పాటు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సహాయంతో కేవలం 5 నిమిషాల్లో భూసార పరీక్ష చేసే విధానాన్ని అగ్రి ఫాబ్రిక్స్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థ కో ఫౌండర్ ,డైరెక్టర్ మెండు శ్రీనివాసులు దీనిని ప్రారంభించారు. నేలలో నత్రజని భాస్వరం పోటాష్ తో పాటు నేల ఉదజని సూచిక , నేలలో సేంద్రియ కర్బన శాతం, ఈసీ మొదలగు విషయాలు కేవలం 5 నిమిషాల్లో రైతులకు అతి తక్కువ ఖర్చులో తెలియజేయడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవసరమైన ఎరువులను మాత్రమే భూమిలో వేయాలని సూచించారు. దీనివల్ల నేలలు సారవంతం అవ్వడమే కాకుండా రైతులు తమ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చని తెలియజేస్తూ భూసార పరీక్ష కేంద్ర ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆంజనేయులు ను సంస్థ డైరెక్టర్ మెండు శ్రీనివాస్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు అశోక్ కుమార్, విష్ణుదాస్ , సంస్థ టెక్నికల్ అధికారి కవిత, పరిమల్ రాజ్ రైతులు పాల్గొన్నారు