

బైకుపై మృతదేహంతో నిరసన.
మనోరంజని స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్:
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన దార్ల హేమ దుర్గా ప్రసన్నను (31) గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ సాయి బలవంతంగా లోపర్చుకొని ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం చనిపోదామని నిర్ణయించుకొని ఆమెకు పురుగుల మందు పట్టించాడు. మరొసారి పురుగుల మందు పట్టించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మహిళా మృతదేహాన్ని సాయి ఇంటికి బైకుపై తీసుకెళ్లారు.