

బెల్లయ్య నాయక్ కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి-
బాణావత్ గోవింద్ నాయక్ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ చైర్మన్
మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 08 :- రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని కేంద్ర పార్టీ అధిష్టానానికి , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి , మంత్రులకు జిల్లా ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఆదివాసి లంబాడీలు ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీని బలపరిచి గెలిపియడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినంక ఇప్పటివరకు లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఇంతకుముందు రాజ్యసభ ఎంపీలు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో లంబాడీలకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. బెల్లయ్య నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ ను స్థాపించి గత 30 సంవత్సరాలుగా లంబాడాలను జాగృతి పరుస్తూ, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారని , ఆదివాసి కాంగ్రెస్ బాధ్యతలను నిర్వహిస్తూ నిరంతరం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ లంబాడి జాతినీ రాజకీయ చైతన్యం కల్పిస్తూ, లంబాడి గిరిజన జాతులకు కాంగ్రెస్ విధివిధానాలను తెలుపుతూ ముందుకు వెళ్తున్నారుని అన్నారు