బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం?

బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం?

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 17 – నేడు తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టారు. వీటితో పాటు.. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, దేవాదాయ చట్ట సవరణ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వీటి కంటే ముందు అసెంబ్లీ సమావే శాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. సభ నుంచి ఏఐఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ నడుపుతున్న సభ తీరును వారు నిరసిస్తూ.. వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటిం చారు. ఇది గాంధీభవన్ కాదని.. అసెంబ్లీని అసెంబ్లీ గా నడపాలని ఎంఐఎం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు.. పలు ప్రశ్నలపై మంత్రి సీతక్క సమాధానాలు చెప్పారు.

అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం..

దుబ్బాక నియోజకవర్గంలో బీసీ హాస్టల్‌లో చోటు చేసుకున్న సంఘటనను తెలంగాణ అసెంబ్లీ లో చర్చించడంపై విమర్శలు, వివాదాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఈ ఘటనను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ.. ఆత్మహత్యా యత్నం చేసిన విద్యార్థి గత రెండు రోజులుగా కోమాలో ఉన్నట్లు తెలిపారు. ఈ సంఘటన భయటకు రాకుండా చేశారని ఫైర్ అయ్యారు. ప్రభాకర్ రెడ్డి ఈ విషయం పై తీవ్రంగా స్పందిస్తూ.. ప్రభుత్వ పక్షం ఎక్కడా ఈ విషయంలో సహాయం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్