బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 :- బీసీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ముస్లిం జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ఏ, బీ, ఈ వర్గాల నేతలు పాల్గొన్నారు.సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలను మత ప్రాతిపదికన విభజించడం ద్వారా గందరగోళం సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు. కుల గణన ప్రకారం మొత్తం బీసీలు 56% ఉండగా, కేవలం 42% రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని అన్నారు. హిందూ బీసీలకు 46%, ముస్లిం బీసీలకు 10% ఉన్నా, బీసీ ముస్లింలను మినహాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించిన నాయకులు, మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లు న్యాయస్థానాల్లో నిలవవని హెచ్చరించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో షేర్ ఆలీ, ఎండి షబ్బీర్, జమీల్, ఎండి దావూద్, అద్నాన్ ఖమార్, శుక్రోద్దీన్, భాషా, ఎండి ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్