

బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి
అర్లీ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఇవ్వండి
శాసనసభలో ఎమ్మెల్యే పవా ర్ రామారావు పటేల్
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 26 :- బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుండి మహారాష్ట్రలోని మహోర్ రేణుక మాత టెంపుల్ 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, జాతీయ రహదారి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. బాసర టు మహుర్ కు జాతీయ రహదారి కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ని కలవడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిస్తే తప్పకుండా ఆమోదిస్తామని ఆయన చెప్పారన్నారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి, ప్రతిపాదన పంపిస్తే మా ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హాయంలో అర్లి బ్రిడ్జి నిర్మాణానికి 56 కోట్ల నిధులు మంజూరు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, తక్షణమే హం పథకం కింద ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలన్నారు. ఆర్లే బ్రిడ్జి నిర్మాణం జరిగితే లోకేశ్వరం, కుంటాల, బాసర, బైంసాతో పాటు అన్ని మండలాల ప్రజలకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.