

బహుజన సిద్ధాంతకర్త కాన్షిరాం బాటలో నడుద్దాం…తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనకై కృషి చేద్దాం :
బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు పెందూర్ అంకుష్ :
మనోరంజని ప్రతినిధి ఇంద్రవెల్లి : మార్చి 15 :- అట్టడుగు వర్గాల్లోని బహుజనులకు రాజ్యాధికారంతోనే న్యాయం చేకూరుతుందనే బలమైన సంకల్పంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 4సార్లు రాజ్యాధికారం తెచ్చిపెట్టిన బహుజన సిద్ధాంతకర్త మాన్యశ్రీ కాన్షిరాం అని బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు పెందూర్ అంకుష్ అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో బహుజన సంఘాలతో కలిసి మాన్యశ్రీ కాన్షిరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా కాన్షిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.తదనంతరం హిరాపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలోని పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు,పెన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మాన్యశ్రీ కాన్షిరాం తాడిత, పీడిత వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు.ప్రతి ఒక్క బహుజనుడు కాన్షిరాం బాటలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు సోన్ కాంబ్లే మనోహర్,బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వావల్కర్ శివాజీ,అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి వాగ్మారే కాంరాజ్,బహుజన సంఘాల నాయకులు కాంబ్లే ఉత్తం, పరత్వాగ్ దత్త, భవాలే సత్యానంద్,దత్త ఆచార్య తదితరులు పాల్గొన్నారు
