

ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో AI ఆధారిత బోధన ప్రారంభమైంది. ఇప్పటికే 41 స్కూళ్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా.. నిన్న(శనివారం) మరో 383 స్కూళ్లలో ప్రారంభించారు. పలు చోట్ల కలెక్టర్లు, డీఈవోలు ప్రారంభించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు విద్యాశాఖ AIని వినియోగించుకుంటోంది.