ప్రభుత్వ నిబంధనలు పాటించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు

ప్రభుత్వ నిబంధనలు పాటించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు
నిర్మల్ జిల్లా: మనోరంజని ప్రతినిధి మార్చి 28 -ప్రభుత్వ నిబంధనలు పాటించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు చేపట్టినట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ నియమాలను పాటించని పలు రైస్ మిల్లుల యజమానులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వానికి సమయానికి ధాన్యం అందివ్వని రైస్ మిల్లర్లు, అధికారుల తనిఖీల్లో ధాన్యం నిల్వలో తేడాలు ఉన్న 9 రైస్ మిల్లులను జప్తు చేసి, చట్ట ప్రకారం కేసులను నమోదు చేసినట్టు తెలిపారు. ధాన్యానికి సంబంధించి 38 కోట్ల రూపాయల విలువైన సిఎంఆర్ ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని, 20 ఎకరాల రైస్ మిల్లర్ల యజమానుల భూములను బ్లాక్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వానికి ధాన్యం బకాయి పడ్డ రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ హెచ్చరించారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం