

ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం
ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంకై కృషి చేద్దాం
ఎన్ హెచ్ ఆర్ సి. నేషనల్ జనరల్ సెక్రెటరీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపు
ఘనంగా గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నాయకుల సమావేశం
మనోరంజని ప్రతినిధి మార్చి 28 :- కోఠి (హైదరాబాద్) : ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నేషనల్ జనరల్ సెక్రెటరీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ కోఠి లోని బీసీసీఇ సమావేశ మందిరంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మిడాల మురళి అధ్యక్షతన జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న తమ సంస్థలో విద్యావంతులు, మేధావులు భాగస్వాములు కావడం హర్షిస్తున్నామని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి పెన్ను పేపర్ ద్వారా అవినీతి రహిత సమాజం కోసం రాజీలేని ఉద్యమ కార్యచరణ రూపొందించామని ఆయన అన్నారు. నేషనల్ కన్వీనర్ ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలలో తమ సంస్థ బలమైన నిర్మాణం చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాముల నారాయణ మాట్లాడుతూ ప్రతి మనిషి జ్ఞానం ద్వారా ఏదైనా సాధించవచ్చని జ్ఞానాన్ని మంచికి మాత్రమే ఉపయోగించుకోవాలని, చెడు మార్గాలకు ఉపయోగిస్తే అనర్ధాలు ఏర్పడతాయని, మనిషికి ఇతర జంతువులకు తేడా ఉండదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వాల్మీకి శోభారాణి, ప్రధాన కార్యదర్శి వీరమల్ల రామ్మూర్తి, ఉపాధ్యక్షులు ఈశ్వర్ రావు, మేడ్చల్, యాదాద్రి, హనుమకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల అధ్యక్షులు మర్రపు నాగార్జునరావు, ముక్కెర్ల బిక్షపతి, విసంపెల్లి నగేష్, చారగొండ బాబు, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, ఐడి కార్డ్స్ వింగ్ ఆవునూరి కిషోర్, యాదాద్రి జిల్లా అధికార ప్రతినిధి మందుల శ్రీకాంత్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఖైరతాబాద్ డివిజన్స్ అధ్యక్షులు కళ్యాణ్, మమత, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలువురికి నియామక పత్రాలు అందించారు.
రాష్ట్ర కమిటీ సభ్యులుగా: అస్మత్ ఉన్నిసా, లయన్ మురళీ మనోహర్
గ్రేటర్ హైదరాబాద్ కమిటీ
అధికార ప్రతినిధిగా: ఎస్ వి సురేష్ రెడ్డి
ఉపాధ్యక్షులుగా: అర్జున్ సింగ్
సంయుక్త కార్యదర్శిగా: టి లావణ్య
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీలో స్వప్న, సంగీత, సునీత, ఉషారాణి తదితరులకు స్థానం కల్పిస్తూ నియామక పత్రాలు అందజేశారు.