ప్రజా ప్రభుత్వ హయంలోనే పేదోడి సొంతింటి కళ నెరవేరనుంది :
రైతు వేదిక భవనంలో 58 కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ :
కడెం : పేదోడి సొంతింటి కలలను ప్రజా ప్రభుత్వం హయాంలోనే నెరవేరనున్నాయని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.మంగళవారం కడెం మండలంలోని రైతు వేదిక భవనంలో 58మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.తదనంతరం నర్సాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాల అందేలా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ప్రజా ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు పరుస్తుందన్నారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పని చేస్తోందని,ఇది పేదల ప్రభుత్వమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు