

పోస్టల్ బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.
మనోరంజని ప్రతినిధి /తానూర్:: మార్చి 28 :-పోస్టల్ బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పోస్టల్ జిల్లా మేనేజర్ సిరిసిల్ల కళ్యాణ్ అన్నారు.ఇటీవలే చిన్న ప్రమాదానికి గురైన కోలుర్ తండా గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తికి ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ద్వారా ఆయనకు కోలూర్ గ్రామపంచాయతీలో రూ..65000 చెక్కులను శుక్రవారం మేనేజర్ కళ్యాణ్, రేషన్ డీలర్ శంకర్రావు, గ్రామ పెద్దల చేతుల మీదుగా అందజేశారు.అనంతరం మండలంలోని పలు గ్రామాల రైతులు పోస్టల్ బ్యాంకింగ్ అకౌంటులను తీయించుకున్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ద్వారా అన్ని ప్రభుత్వ సబ్సిడీలకు, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలకు పోస్టల్ బ్యాంకింగ్ ఖాతా ఉపయోగపడుతుందని, పోస్టల్ బ్యాంకింగ్ లో బీమా సౌకర్యం కూడా ఉంటుందని, భీమ ప్రీమియం 520 రూపాయల నుండి 750 రూపాయల వరకు చేసుకోవచ్చని అన్నారు. ఈ పోస్టల్ బ్యాంకు లో బీమా చేసుకున్న వ్యక్తి, ప్రమాదవశాత్తు మరణిస్తే, అంగ వైకల్యం ఏర్పడితే 10 లక్షలు,15 లక్షలు వరకు భీమ పొందవచ్చని, మెడికల్ ఖర్చుల కొరకు కూడా ఈ సంస్థ ఉపయోగకరంగా ఉంటుందని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు మహేష్, మాజీ ఎంపీటీసీ సురేష్ పటేల్, శ్రీనివాస్ రెడ్డి, ఐబిసి దశరథ్,పవన్, గ్రామపంచాయతీ కార్యదర్శి తిరుపతిరెడ్డి,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు