పోరాడండి – ఎమ్మెల్యేలకు కేసీఆర్ కర్తవ్యబోధ!

పోరాడండి – ఎమ్మెల్యేలకు కేసీఆర్ కర్తవ్యబోధ!

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 11 :- అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మూడు గంటల పాటు అసెంబ్లీలో ఎలా పోరాడాలో వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ప్రజల కష్టాలన్నింటినీ చెప్పి.. ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలని కర్తవ్యబోధ చేశారు. ఈ పోరాటానికి ముందు ఉండేలా బీఆర్ఎస్ఎల్పీకి డిప్యూటీ లీడర్లను కూడా నియమిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ఎల్పీ నేత, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు. డిప్యూటీ లీడర్లను నియమిస్తామని చెప్పడంతో కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నారు. తాను అసెంబ్లీకి వస్తానని ప్రభుత్వాన్ని అందరం కలిసి చెండాడుదామని ఆయన చెప్పలేదు. ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ ఆఫర్ ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. కానీ అనర్హతా వేటు తప్పించుకోవడానికి కేవలం ఒక్క రోజు .. జగన్ తరహాలో హాజరువుతారన్న ప్రచారం జరుగుతోంది. గవర్నర్ ప్రసంగానికి హాజరై ఆ తర్వాత ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయే అవకాశం ఉంది.డిప్యూటీ లీడర్లుగా కేటీఆర్, హరీష్ రావులను నియమించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇతర వర్గాలకు అవకాశం కల్పించరా అన్న ప్రశ్నలు వస్తాయి. ఎవర్ని నియమించినా అసెంబ్లీలో పోరాటం వీరిద్దరి కనుసన్నల్లోనే జరుగుతుదంని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బాగుంటుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ కు ఎవరు సమాధానం ఇచ్చినా ఎఫెక్టివ్ గా ఉండదని.. కేసీఆర్ కౌంటర్ ఇస్తే ఆ హైప్ వేరుగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ సారి కూడా హాజరవ్వాలని అనుకోవడం లేదు.

  • Related Posts

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన…

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను తమిళనాడు పీడబ్యూడీ శాఖ మంత్రి ఈ.వి.వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ నెల 22న చెన్నైలో జరుగనున్న దక్షిణభారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్