పెద్ద బజార్లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 17 :-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 50వ డివిజన్ పెద్ద బజార్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన టవర్పై కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక గల్లీ వాసులు ధర్నా నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బట్టు రాఘవేందర్ (రాము), ఎన్హెచ్ఆర్సి జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో అసిస్టెంట్ కలెక్టర్ను కలిసి టవర్ తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
అసిస్టెంట్ కలెక్టర్ స్పందిస్తూ, అక్రమంగా నిర్మించిన టవర్ తొలగింపునకు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసి పర్యవేక్షణతో చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వైరాగర్ మోహన్, చందు, మహిళా సభ్యులు పద్మ, రోహిణి, పవిత్ర తదితరులు పాల్గొన్నారు