

పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య?
మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి జిల్లా మార్చి 28 -పెద్దపల్లి జిల్లా ముప్పిరితోట గ్రామానికి చెందిన ఓ యువతిని సాయికుమార్, అనే యువకుడు ప్రేమిం చాడు. వారి సామాజిక వర్గాలు వేరు కావడంతో యువతి తండ్రి సాయి కుమార్ను పలు మార్లు హెచ్చరించాడు. కాగా గురువారం సాయికుమార్, బర్త్ డే కావడంతో సాయికుమార్ రాత్రి స్నేహితులతో వేడుకలకు సిద్దమైన సమయంలో మాటు వేసిన అమ్మాయి తండ్రి గొడ్డలితో దాడి చేశాడు.తీవ్ర గాయాలపాలైన సాయికుమార్ను స్నేహితులు, బంధువులు సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున యువ కుడు మృతి చెందాడు. ప్రేమించిన పాపానికి పరువు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ విచారణ చేపట్టారు. గ్రామంలో ఘర్షణ తలెత్తకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. యువతి తండ్రి చేతిలో హత్యకు గురికావడంతో స్నేహితులు జీర్ణించుకోలేక పోతున్నారు. నిందితుడు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు