

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భవతి మహిళ
అర్ధరాత్రి 108లో ఆసుపత్రికి తరలించిన
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 23 – నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ కి చెందిన ప్రతిభ పాటేకర్ కి పురిటినోపులు వచ్చాయని ఆమె భర్త ప్రసాద్ రాత్రి 11 గంటలకు గడ్డం సుభాష్ ను చరవాణి ద్వారా సాంప్రదించడం జరిగింది. భార్యకు పురిటి నొప్పులు వచ్చాయి మాది నిరుపేద కుటుంబం ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేపిచ్చే స్తోమత లేదు అనగానే వారి అత్తగారి ఇంటి నుంచి కుభీర్ మండలం మోల గ్రామం నుండి 108లో అర్ధరాత్రి 12 గంటలకి బైంసా ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి గురించి అవగాహన కల్పించి డాక్టర్ కాశీనాథ్ తో మాట్లాడి ఆదివారం ఉదయం సుమారు 11 గంటలకు ఆపరేషన్ చేయడంతో పండంటి ఆడబిడ్డను జన్మనివ్వడం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను 108 వాహనంలో తరలించి ప్రసవం జరిగే విధంగా సహకరించినందుకు కుటుంబ సభ్యులు గడ్డం సుభాష్ ను అభినందించారు. బాలింత ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి విడిసి మాజీ అధ్యక్షుడు గుంజల నారాయణ, స్థానికులు లక్ష్మన్న, సాయినాథ్, జల్బా, విట్టల్ తదితరులు వెళ్లడం జరిగింది.