పసుపు క్వింటాల్కు 15 వేల ధరతో కొనుగోలు చేయాలి AIKMS డిమాండ్

పసుపు క్వింటాల్కు 15 వేల ధరతో కొనుగోలు చేయాలి AIKMS డిమాండ్

మెంట్రాజ్ పల్లి గ్రామం లో AIKMS ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు
ఈ సందర్భంగా AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ పసుపు రైతులు గత పక్షం రోజులుగా మార్కెట్లోకి పసుపును తెచ్చి అమ్ముకుందామంటే రైతులకు తగిన ధరలు రాక ఆందోళన చెందుతున్నారని వరన్నారు. మార్కెట్లో మధ్య దళారీలు, వ్యాపారస్తులు సిండికేట్గా మారి ధరలను తగ్గించి రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని వేల్పూర్ భూమయ్య అన్నారు. పసుపు పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అల్లాడుతున్నారు మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ ధరలు ఇక్కడ రైతులకు రావడం లేదు అధికారులు సైతం రైతులు వ్యాపారస్తుల మోసాలకు గురికాకుండా చూడడంలో విఫలమవుతున్నారు. రైతులు తమ పంట కు లాభసాటి ధర పొందలేకపోతున్నారు గతంలో కింటాలు పసుపుకు 16,000 వరకు ధరలు చెల్లించిన వ్యాపారస్తులు నేడు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల వరకు ధరలు పెట్టడం లేదు దీనంతటికీ ప్రధానంగా మార్కెట్లో వ్యాపారస్తులు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తున్నారని వరన్నారు. రైతులకు పెట్టిన పెట్టుబడులు రాలేక అప్పుల పాలవుతున్నారు. ఇన్దుకుగాను పసుపు క్వింటాల్కు 15 వేల ధర చెల్లించాలని రైతుల వద్ద ఉన్న పసుపును వెంటనే కొనుగోలు చేయాలని మా అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రోజులకొద్దీ మార్కెట్లో కుప్పలు పోసుకొని ఎదురుచూస్తున్నా రైతుల పసుపును కొనుగోలు చేయాలని వరి ధాన్యం మాదిరిగానే పసుపు క్వింటాల్కు 1000 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను నిలువున ముంచుతున్న వ్యాపారస్తులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.అలాగే రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయాలనీ, నిజామాబాదు లో గల చక్కెర ఫ్యాక్తరీలను ప్రభుత్వంమే తెరిపించి నడిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో దేవస్వామి, jp గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లేఖ రాశారు. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు గారు…

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    స్వాతంత్య్ర సమరయోధుడు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా దక్షత, సాహితీ ప్రేమ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భారత బాక్సింగ్‌ సమాఖ్య నుంచి ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు

    భారత బాక్సింగ్‌ సమాఖ్య నుంచి ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి