

పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు…
-పండుగలు భారతీయ సంస్కృతి కి ప్రతికలు…
మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చ్ 29; తెలుగువారి నూతన సంవత్సరం (శ్రీ విశ్వ వసు) ఉగాది ఉత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ మాట్లాడుతూ….. పండుగలు భారతీయ సంస్కృతికి చిహ్నాలని, సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లని అన్నారు. ఈ వారసత్వ సంపద భావితరాలకు అందించాలన్నారు. పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఉగాది పచ్చడిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయికుమార్, భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, మధుసూదన్, లింగమూర్తి, ఎల్లన్న, సంజు, సిఆర్పి గంగాధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

