

పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 29 :- తెలుగువారి నూతన సంవత్సరం(శ్రీ విశ్వావసు) ఉగాది ఉత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చుచుంద్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా తపస్ జిల్లా గౌరవ అధ్యక్షులు జిల్లా జి. రాజేశ్వర్ మాట్లాడుతూ..పండుగలు భారతీయ సంస్కృతికి చిహ్నాలని, సంస్కృతి, సంప్రదాయా లకు భారతదేశం పుట్టినిల్లని అన్నారు. ఈవారసత్వ సంపద భావితరాలకు అందించాలన్నారు. మాధ్యమం ఆంగ్లమైన సంస్కృతి భార తీయం కావాలని ఆకాంక్షించారు. పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఉగాది పచ్చడిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు పండరి, యోగిత,భోజరాం, విద్యార్థులు
పాల్గొన్నారు

