

నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 22 :- నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా పంట నష్టం కలిగించాయి. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించి పంట పొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, నష్టపోయిన పంటలు పరిశీలించి వారానికి లోపు పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.రైతుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలని, అధికారులు వెంటనే పంట నష్టం అంచనా వేసి సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి అని బండి సంజయ్ స్పష్టం చేశారు.