ధర్పల్లిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 29 – ధర్పల్లి మండల కేంద్రంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ సత్య సాయి బాల వికాస్ తల్లిదండ్రుల సమావేశంలో “మహిళా విభాగం వారి పాత్ర” అనే అంశంపై చర్చించారు.ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా బాల వికాస్ ఇన్‌చార్జి డాక్టర్ మంజుల మాట్లాడుతూ, పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి మాటలు చెప్పడం మాత్రమే కాకుండా, వారే స్వయంగా మంచి ప్రవర్తన పాటించాలి. పిల్లలు మాటలు కన్నా, తల్లిదండ్రుల ఆచరణను ఎక్కువగా గ్రహిస్తారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ ఇన్‌చార్జి పుష్పలత, బాల వికాస్ డిస్టిక్ జాయింట్ కోఆర్డినేటర్ శోభ, యూత్ కోఆర్డినేటర్ వనిత, జాయింట్ కోఆర్డినేటర్ జ్యోతి, సమితి మహిళా కన్వీనర్ కృష్ణవేణి, మంతెన లక్ష్మి, పిండి మమత, సత్యసాయి ప్రతినిధులు చిలుక శంకర్, మచ్చ బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

    కామోల్ లో ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేళ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక వేడుకలు…

    శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం

    తెలుగువారి కొత్త సంవత్సరోత్సవం అయిన ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో కిషన్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం