

దారుణం.. 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారం
మనోరంజని ప్రతినిధి మార్చి 10 – యూపీ కాన్పూర్లో దారుణం జరిగింది. రంజాన్ మాసం కావడంతో అజార్, హుస్సేన్ అనే వ్యక్తుల పార్ట్నర్స్ శృంగారానికి నిరాకరించారని 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. డీసీపీ బ్రజేంద్ర ద్వివేది వివరాల ప్రకారం.. మార్చి 5న జిమ్కు వెళ్తున్న బాలుడిని నిందితులు కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తాడుతో గొంతు బిగించి చంపారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసినట్లు పేర్కొన్నారు. హుస్సేన్ను అరెస్ట్ చేయగా.. అజార్ పరారీలో ఉన్నాడు