

తెలంగాణ క్యాబినెట్లోకి నలుగురు కొత్త మంత్రులు!
క్యాబినెట్ విస్తరణపై నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గే, మీనాక్షి, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, ఉత్తమ్, మహేశ్ సుదీర్ఘంగా చర్చించారు. ఈక్రమంలో నలుగురికి కొత్తగా మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీల మేరకు మక్తల్ MLA శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్, బోధన్ MLA సుదర్శన్ రెడ్డికి ‘అమాత్య’ యోగం కల్పించనున్నట్లు సమాచారం.