

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు
▪️TG: రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గం. నుంచి మధ్యాహ్నం 12:30 గం. వరకు తరగతులు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం తరగతులు నిర్వహించనున్నారు.