

తెలంగాణకు గ్రామస్థాయి అధికారులు వస్తున్నారహో…
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 22 – గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్దీస్తా మని, సీఎం రేవంత్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తో పాటు పలువురు నాయకులు ప్రకటించినట్లుగానే మంత్రిమండలి 10,954 గ్రామ పరిపాలన అధికారి పోస్టులకు ఆమోదం ఆమోదముద్ర వేసింది.. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే గ్రూప్ 1,2,3 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా గత సంవ త్సరం జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలో 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలన అధికా రుల (GPO ) పోస్టులు మంజూరు చేస్తూశనివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది… నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు GPO గా నామకరణం చేసింది. కాగా రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాల కు గ్రామ పాలన అధికారు లను నియమించాలని,రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణ యం తీసుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్ఓ, వీఆర్ఏలను ఇతర ప్రభు త్వ శాఖల్లో విలీనం చేసింది. మళ్లీ గ్రామ పాలన అధికారులను నియమించా లని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు