తిరుమల శ్రీవారి సన్నిధికి సీఎం చంద్రబాబు నాయుడు

తిరుమల శ్రీవారి సన్నిధికి సీఎం చంద్రబాబు నాయుడు

మనోరంజని ప్రతినిధి తిరుపతి జిల్లా: మార్చి 21 – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం గురువారం రాత్రి తిరుమల చేరుకున్నారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్రమంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ కూడా ఉన్నారు. పద్మావతి విశ్రాంతి గృహం దగ్గర టీటీ డీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి రామానారాయణ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామల రావు తదితరులు పుష్పగు చ్ఛాలతో స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేసిన సీఎం కుటుంబం, శుక్రవారం ఉదయం స్వామివారి దర్శనానికి వెళ్లనుంది.నేటి ఉదయం 7:45 గంటలకు పద్మావతి విశ్రాంతి గృహం నుంచి బయలుదేరి వైకుం ఠం-1 క్యూ కాంప్లెక్స్‌కు చేరుకుంటారు. ఉదయం 8 నుంచి 8:50 గంటల వరకు శ్రీవారి ఆలయంలో దర్శనం చేసుకుంటారు. ఆలయ సంప్రదాయాలను గౌరవి స్తూ, మహాద్వారం ద్వారా కాకుండా క్యూ కాంప్లెక్స్ నుంచే ప్రవేశిస్తారు. దర్శనం తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకుంటారు

  • Related Posts

    సాయం అందించే చేతులకు వేదిక పీ4

    Press Release సాయం అందించే చేతులకు వేదిక పీ4 సంపన్నులు – పేదలను ఒకేచోటకు చేర్చడమే లక్ష్యం ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకురావొచ్చు అండగా నిలిచేవారు ‘మార్గదర్శి’ – లబ్ధి పొందేది ‘బంగారు కుటుంబం’ మొదటి దశలో 20 లక్షల…

    నర్సాపూర్ లో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణాన్ని పరిశీలించిన మన్యశ్రీ పూజ్యులు అరుణ్ గురు స్వామి

    నర్సాపూర్ లో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణాన్ని పరిశీలించిన మన్యశ్రీ పూజ్యులు అరుణ్ గురు స్వామి మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చి 24 :- మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని గల అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణాన్ని పరిశీలించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?