

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే
మనోరంజని ప్రతినిధి తిరుపతి జిల్లా : ఏప్రిల్ 04 :-తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి,వారిని టాలీవుడ్ స్టార్ నటి పూజా హెగ్డే ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతంపలికి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితు లు నటిని శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు పూజా హెగ్డే తిరుపతి జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన శ్రీకాళ హస్తీశ్వరుడిని దర్శించుకు న్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం శ్రీ కాళహస్తికి వెళ్లిన నటి.. అక్కడ రాహుకేతు పూజ లో పాల్గొన్నారు. అనంత రం శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాం బిక దేవిని దర్శించుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. పూజా ప్రస్తుతం దళపతి విజయ్తో జననాయగన్ సినిమాలో నటించడంతో పాటు సూర్య హీరోగా వస్తున్న రెట్రో చిత్రంలో కథానాయికగా నటిస్తుంది