డీలిమిటేషన్ ప్రభావంపై దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

ప్రతిపాదిత డీలిమిటేషన్ మార్పుల వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొవాల్సిన సమస్యలపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, యంపి మల్లు రవి హాజరయ్యారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ప్రతినిధుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, దీనివల్ల రాజకీయ సమతుల్యత దెబ్బతింటుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకు ఒక సమిష్టి కార్యాచరణ రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ హక్కులు, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కోసం బలమైన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ అన్నారు. నిన్న హైదరాబాదులో ట్రైన్ లో నుండి ఓ…

    రబ్బర్‌ స్టాంప్‌ అధ్యక్షుడు వద్దు

    రబ్బర్‌ స్టాంప్‌ అధ్యక్షుడు వద్దు సీనియర్లు, శ్రేణులకు కమిటీలో సముచిత స్థానం కల్పించాలి సీఎంతో కొత్త అధ్యక్షుడు రహస్య మంతనాలు చేయొద్దన్న రాజాసింగ్‌ అధ్యక్ష పదవి రేసులో లేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకంపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..

    ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..

    తెలంగాణ క్యాబినెట్లోకి నలుగురు కొత్త మంత్రులు!

    తెలంగాణ క్యాబినెట్లోకి నలుగురు కొత్త మంత్రులు!