

టెన్త్ సెంటర్లను సందర్శించి మండల విద్యాదికారి
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 20 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ శుక్రవారం నుండి జరగ బోయే పదవతరగతి పరీక్షాకేంద్రాలను మండల విద్యాదికారి రమణారెడ్డి సందర్శించారు. దీనిలో భాగంగా రబింద్రా పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో మొత్తం 240 మంది విద్యార్థులు, 14 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా రబింద్రాలో ప్రతి రూంను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పకడ్బందిగా ఏర్పాట్లు చేశామని అన్నారు. జెడ్పిహెచ్ యస్ ముధోల్ సెంటర్లో 180 మంది విద్యార్ధులు, 10 ఇన్విజిలేటర్లు, ఆశ్రమ పాఠశాలలో 167 విద్యార్థులు, 10 మంది ఇన్విజిలేటర్లు, అదే విధంగా అష్ట సెంటర్లో 114 విద్యార్థులు, O8 మంది ఇన్విజులేటర్లు మొత్తంగా 701 విద్యార్థులు, 42 ఇన్విజలేటర్లు, నలుగురు సి ఎస్ లు, నలుగురు డి ఓ లు నియమించడం జరిగిందన్నారు. విద్యార్థులు ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తులను తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ ప్రజోత్ కుమార్, డివో శ్రీరాములు, నర్సింగ్ రావు సాయరెడ్డి, రబీంద్ర ప్రిన్సిపాల్ అసంవార్ సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు