

జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లో పదవి విరమణ వీడ్కోలు సభ
మనోరంజని, హైదరాబాద్ ప్రతి నిధి:- హైదరాబాద్, మార్చి 29, 2024: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) లో బి. కిషన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, DUFR, JNTUH మరియు యు. రవీందర్ రావు, సూపరింటెండెంట్, UGC వ్యవహారాల విభాగం, JNTUH, కుకట్పల్లి, హైదరాబాద్ లకు పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. మార్చి 29, 2024న జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, సహోద్యోగులు మరియు ఇతర విశ్వవిద్యాలయ సభ్యులు పాల్గొని, వారిద్దరి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రెక్టర్ డా. కె. విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డా. కె. వెంకటేశ్వర రావు, సీనియర్ అధికారులు, అధ్యాపకులు మాట్లాడుతూ బి. కిషన్ మరియు యు. రవీందర్ రావు అందించిన అమూల్యమైన సేవలను ప్రశంసించారు. వారి కృషి, నిబద్ధత, విశ్వవిద్యాలయ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తుచేశారు. బి. కిషన్ మరియు యు. రవీందర్ రావు తమ సుదీర్ఘ సేవల కాలంలో అందించిన సహాయ సహకారానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా వారిని సన్మానించి, జ్ఞాపికలు అందజేసి, అనంతరం కృతజ్ఞత గానంతో సభ ముగిసింది.