జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి.. కానీ అవకాశాలు సృష్టించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు రాజకీయంగా క్రాస్ రోడ్స్ లో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు, వైసీపీ అధినేత జగన్ కు ఓ చాన్స్ వచ్చింది. ఈ రెండు రాజకీయ పార్టీల అధినేతలు తమ అవకాశాలను సృష్టించుకునే విషయంలో పూర్తిగా వెనుకబడిపోయారు. కానీ ఇప్పుడు వెదుక్కుంటూ ఓ అవకాశం వచ్చింది. అది స్టాలిన్ రూపంలో .

మోదీపై పోరాటానికి పిలుపునిచ్చిన స్టాలిన్

స్టాలిన్ దక్షిణాది సెంటిమెంట్ ను మరింత పెంచి.. బీజేపీకి దక్షిణాదిలో చోటు లేకుండా చేయాలని డిసైడయ్యారు. అందుకే ప్రత్యేకంగా సమావేశం పెట్టి దక్షిణాదికి చెందిన ప్రముఖ పార్టీలను పిలుపుస్తున్నారు. ఆయన ప్రతినిధులు హైదరాబాద్, విజయవాడ వచ్చి సమావేశానికి రావాలని జగన్, కేసీఆర్‌లను ఆహ్వానించారు. ఇది వారికి వచ్చిన గొప్ప అవకాశం అనుకోవచ్చు. ఎందుకంటే రెండు పార్టీలకూ ఇప్పుడు వెళ్తున్న దారి పరోక్షమే.

ప్రత్యక్షంగా ఏదో ఓ దారి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.

బీజేపీతో దోస్తీ కష్టమే – పోరాటమే శరణ్యం

బీజేపీని ఎదిరించి బతికి బట్టకట్టే పరిస్థితి లేదని కేసీఆర్, జగన్ అనుకుంటున్నారేమో తెలియదు కానీ వ్యతిరేకించకపోతే మాత్రం ఆ పార్టీలు నిర్వీర్యం అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీజేపీ నోట చిక్కింది. ఇంకా కొద్ది రోజులు పోతే బీఆర్ఎస్ ఉనికిని బీజేపీ దెబ్బతీస్తుంది . అయినా కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై కేటీఆర్ మాట్లాడుతున్నారు. కానీ అది బీజేపీ యాంగిల్లో కాదు. ఇక్కడే వారి చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది. అలాగే జగన్ కూడా. తమ వ్యతిరేక పార్టీలతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడితే ఆ కూటమికే మద్దతివ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వైసీపీ. ఇలాంటి పరిస్థితిని ఎందుకు దూరం చేసుకోకూడదు.

పోరాడితే పోయేదేం ఉంటుంది?

పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప… అని గుర్తు చేసుకుంటే.. ఈ రెండు పార్టీల అధినేతలు ధైర్యం చేసి స్టాలిన్ సమావేశానికి వెళ్తారు. అక్కడ బీజేపీని చీల్చి చెండాడుతారు. ఆ తర్వాత అదే పద్దతిలో బీజేపీని ప్రత్యర్థిగా చేసుకుంటారు . అలా చేసుకోవడం వల్ల ఈడీ, సీబీఐలు వస్తాయని భయపడతారేమో కానీ అలా రావడం వల్ల కూడా వారికి రాజకీయ ప్రయోజనం ఉంటుంది. మరి ఈ ఇద్దరు అగ్రనేతలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా?

  • Related Posts

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 13 :- అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధిపై చర్చిస్తున్న సమయం లో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన వాఖ్యలకు నిరసన గా కడెం కాంగ్రెస్ పార్టీ…

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కాంట్రాక్టు ప్రాదిపదికన 1,194 కంకరెంట్ ఆడిటర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 15 మార్చి 2025 వరకు ఆన్‌లైన్‌లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ