చిన్నారి శ్రీవిద్య చదువుకు అండగా కేటీఆర్

చిన్నారి శ్రీవిద్య చదువుకు అండగా కేటీఆర్

బర్త్ సర్టిఫికేట్, ఆధార్ లేకపోవడంతో శ్రీవిద్య అడ్మిషన్ రద్దు

పత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన కేటీఆర్

ఆధార్ కార్డు ఇప్పించే చర్యలు- రెండు సంవత్సరాల ఫీజు చెల్లింపు

చిన్నారి శ్రీవిద్య మళ్లీ స్కూలు గడప తొక్కింది. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలతో మళ్లీ స్నేహం చేస్తుంది. ఆమె కలలకు కేటీఆర్ రెక్కలు తొడగడంతో మళ్లీ బడిబాట పట్టింది. సరైన పత్రాలు లేకపోవడం హైదరాబాద్ సనత్ నగర్ దాసారం బస్తీకి చెందిన మల్లెల శ్రీవిద్య అడ్మిషన్ ను స్కూల్ యాజమాన్యం రద్దు చేసింది. బాగా చదువుకోవాలని ఆశపడ్డ శ్రీవిద్యకు ఆధార్ రూపంలో ఎదురైన సమస్య గురించి పత్రికలో వచ్చిన వార్తకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తన కార్యాలయ సిబ్బందిని శ్రీవిద్య ఇంటికి పంపించి తల్లిదండ్రులతో మాట్లాడించారు. ఆధార్, బర్త్ సర్టిఫికేట్ ఇప్పించడంలో సహాయం చేస్తామన్నారు. ఇంతేకాదు శ్రీవిద్య తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్, ఆమె చదువు ఆగిపోవద్దనే ఉద్దేశంతో రెండు సంవత్సరాల స్కూల్ ఫీజును చెల్లించారు. భవిష్యత్తులో శ్రీ విద్య చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని చెప్పారు. కేటీఆర్ చొరవతో సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి అవసరమైన సర్టిఫికేట్లు ఇప్పిస్తానని హామి ఇచ్చారు. తమ సమస్య గురించి తెలుసుకుని శ్రీవిద్య జీవితానికి కొత్త వెలుగు అందించిన కేటీఆర్ కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పత్రికలో వార్త వచ్చిన తరువాత అధికారులు నామమాత్రంగానే స్పందించారని చెప్పారు. రెండు సంవత్సరాల ఫీజు ముందే కట్టడంతో పాటు భవిష్యత్తులోనే శ్రీవిద్య చదువుకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానన్న కేటీఆర్ కు వారు ధన్యవాదాలు తెలిపారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్