చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ONGC ఆఫీస్లో అసిస్టెంట్ అకౌంటెంట్
హోలీ పండుగ సందర్భంగా భార్య తనూజను, ఇద్దరు కుమారులు జోషిల్, నిఖిల్ను తీసుకుని తన ఆఫీస్కి వెళ్లిన చంద్రకిశోర్
అనంతరం పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పి, భార్యను ఆఫీస్లోనే ఉండమని నమ్మించి ఇంటికి వెళ్లిన చంద్రకిశోర్
ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన చంద్రకిశోర్.. పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు ముంచి హత్య.. ఆపై తాను ఉరి వేసుకుని సూసైడ్
ఎంతసేపటికీ భర్త రాకపోవడంతో తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్లిన తనూజ
కిటికీ నుంచి చూడగా భర్త, పిల్లలు విగతజీవులుగా కనిపించిన వైనం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, చదవలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్ సూసైడ్ నోట్