గ్రైనేట్స్ తవ్వకాలను ఆపాలని తహసిల్దార్ కు వినతి
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో జనావాసాలకు సమీపంలో ఉన్న గ్రానైట్స్ తవ్వకాలను ఆపాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల నిర్మల్ జిల్లా (ఎన్.హెచ్.ఆర్.సి) కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ శ్రీకాంత్ వినతి పత్రం అందించారు. తవ్వకాలు- బ్లాస్టింగ్ వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసి గ్రానైట్స్ రాళ్లను కాంట్రాక్టర్ అక్రమంగా తీసుకెళ్లిన ఎవరూ పట్టించుకోవడం లేదు. అటువైపు వెళ్లే దారిలో బస్సులు, ఆటోలు, లారీలు వెళ్లే క్రమంలో తరచూ బ్లాస్టింగ్ నడుస్తూ ఉంటుంది. అక్కడినుండి పాదచారులు, వాహనాలు వెళ్తుండగా బ్లాస్టింగ్ అయితే ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎవరు కూడా ప్రత్యేక తీసుకోవడం లేదు అన్నారు. ఇప్పటికి చాలా సంవత్సరాల నుండి గ్రానైట్స్ తవ్వకాలు జరుగుతున్నవి. కోట్లాది రూపాయల గ్రానైట్స్ రాళ్ల తవ్వకం అనేది ప్రభుత్వపరంగా నడుస్తుందా లేదా ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్నారనే విషయాన్ని ప్రజలకు బహిరంగపరచాలని తెలియజేస్తున్నాం. అక్రమంగా తవ్వకాలు జరిగినట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్.సి రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యవంశీ మాధవరావు పటేల్, బైంసా పట్టణ అధ్యక్షుడు జిల్లా హన్మండ్లు, కుంటాల మండల అధ్యక్షుడు గుమ్ముల దినేష్ కుమార్, ఎన్. హెచ్ ఆర్.సి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు