

తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా, నిర్మల్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ నేతృత్వంలో మామడ మండలంలో ఘన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే, ఈ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మామడ మండల్ ఇన్చార్జి అనిల్ రఫి, మాజీ జడ్పీటీసీ లింగారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ రాథోడ్ జైసింగ్, ఎంపీపీ రాథోడ్ సంతోష్, జడ్పీటీసీ బాపయ్య, వకీల్ సాగర్, ప్రేందాస్ రసమళ్ళ అశోక్, ప్రవీణ్, రత్నం తదితరులు పాల్గొన్నారు.