గోధుమ పంట కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 22 :- నిర్మల్ జిల్లా భైంసా మండలం సిద్దూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామ శివారులో రైతు జాదవ్ మారుతి పాటిల్ పండించిన గోధుమ పంట కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఈ ఘటనలో పూర్తిగా దగ్ధమైంది.పంటకు నిప్పు పెట్టడంతో సుమారు రూ.30,000 మేరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు చేసి బాధ్యులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఆధారపడిన రైతులు ఇలాంటి ఘటనల కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

  • Related Posts

    హైదరాబాద్‌లో మరో ఘోరం.. ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం..!

    హైదరాబాద్‌లో మరో ఘోరం.. ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం..! ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై యువకుడు అత్యాచారయత్నం ట్రైన్ నుంచి దూకేయ్యడంతో గాయపడిన యువతి గాంధీ ఆసుపత్రికిలో చికిత్సపొందుతున్న బాధితురాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎంఎంటీఎస్ రైలులో…

    సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే 8 మంది మృతి?

    సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే 8 మంది మృతి? TG: ఫిబ్రవరి 22న SLBC సొరంగం కూలి 8 మంది చిక్కుకుపోయిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే అందరూ మృతి చెందినట్లు అధికారులు అంచనాకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు..!!

    పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు..!!

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది..!!

    తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది..!!

    28న రైతుల దేశవ్యాప్త నిరసన..!!

    28న రైతుల దేశవ్యాప్త నిరసన..!!