

గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.
*మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి మాజీ సర్పంచ్ దర్శనాల రమేష్ 50,116 రూపాయలను విరాళంగా ఇచ్చారు. గుడి ప్రారంభోత్సవము మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కొరకు బూరుగుపల్లి గ్రామం నుండి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్య రాజ్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ స్వాములు అందరు కలిసి భీమారం మండలం సర్పంచ్ ల మాజీ పోరం అధ్యక్షులు, పొలంపల్లి మాజీ సర్పంచ్ దర్శనాల రమేష్ ని అడుగగా 50116/-రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన దర్శనాల రమేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.