

గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి
మనోరంజని ప్రతినిధి కుబీర్ : మార్చి 22 – నిర్మల్ జిల్లా కుబీర్ పార్డి (బి ) గ్రామానికి చెందిన ఆర్ ఎంపీ వైద్యులు పోతన్న శనివారం ఉదయం గుండె పోటుతో మృతి చెందడం జరిగింది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలపిన వివరాల ప్రకారం పోతన్న అనే ఆర్ ఎంపీ వైద్యులు ఉదయం గ్రామంలో ఉన్న ప్రజలకు వైద్య సేవలు అందించి తిరిగి ఇంటికి వచ్చారు ఇంట్లో కుటుంబ సభ్యులు తన కుమారుడి వివాహం కొరకు నూతన వస్త్రాలు కొనుగోళ్లు చేసేందుకు హైదరాబాద్ కు వెళ్లారు. దింతో ఆయన ఒక్కరే ఇంటి వద్ద ఉన్నారు. దింతో ఒక్కసారిగా గుండె పోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అదే క్రమంలో పోతన్న తల్లి కుమారుడి కొరకు భోజనము తీసుకువచ్చి చూసే సరికి కుర్చీలో ఉన్న పోతన్న కింద పడిపోవడం తో చుట్టూ ప్రక్కల వారికి తెల్పడం తో వెంటనే బైంసా అస్పత్రి కి తరలించగా అక్కడి వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. పోతన్న మృతి చెందిన సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కంటి తడి పెట్టారు