

కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది : హరీష్ రావు..!!
సిద్దిపేట,కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ…. మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారికంగా ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇఫ్తార్ విస్మరించిందన్నారు. మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా మాజీ సీఎం కేసీఆర్ మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలలను మోడల్ స్కూల్లో విలీనం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు అత్తర్ పటేల్, నయ్యర్ పటేల్, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, మో ఈజ్ తదితరులు పాల్గొన్నారు