

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో భారీగా చేరికలు – గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎర్రబెల్లి
మనోరంజని ప్రతినిధి రాయపర్తి మార్చి 29 :- రాయపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ముఖ్యంగా రేవంత్ ప్రజా దర్బార్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ఆశ్రఫ్, మాజీ వార్డ్ నెంబర్ భర్త జలగం రవి, ఎండీ అఖిల్, కాస్రబోయిన కుమార్ (కరుణం), ఎండీ కామరోద్దీన్, పోగులకొండ ఎల్లయ్య, చెడుపాక శ్రీకాంత్, గారే అనిల్, గారే వెంకన్న, గారే రమేష్, గుగులోత్ చంద్రు, గుగులోత్ వెంకటేష్ తదితరులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అందరికీ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, స్థానిక నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

