

ఏప్రిల్ 12న వీర హనుమాన్ విజయ యాత్ర
కరపత్రాలు ఆవిష్కరించిన
విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు
మనోరంజని ప్రతినిధి కరీంనగర్,మార్చి,29 :- ఏప్రిల్ 12వ తేదీన నగరంలో
వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్ , భజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన కరపత్రాలు,వాల్ పోస్టర్లను శనివారం బిఎంఎస్ అనుబంధ
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాత్ర గాంధీ రోడ్డులోని రామాలయం వద్ద ప్రారంభమై టవర్ సర్కిల్, ప్రకాశం గంజ్, కమాన్ చౌరస్తా, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, బస్టాండ్, గీత భవన్, కోర్టు రోడ్డు, మంచిర్యాల చౌరస్తా మీదుగా కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్ర ద్వారా హిందూ సమాజన్ని జాగృతం చేయడానికి విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్హా జరవుతారని చెప్పారు. ధైర్యం, శక్తి సామర్థ్యాలకు ప్రతీక అయినటువంటి హనుమంతున్ని ఆదర్శంగా తీసుకొని హిందూ యువత దేశ, ధర్మ రక్షణ కోసం పాటుపడాలనీ,లవ్ జీహాదీల నుండి మాతృ మూర్తుల రక్షణ,
మత మార్పిడుల నిరోధం కోసం ఈ ర్యాలీలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంత గోరక్ష కమిటీ సభ్యుడు ఊటుకూరి రాధాకృష్ణారెడ్డి, జిల్లా సహా కార్యదర్శి తోట రాజేందర్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గుజ్జేటి రాజేందర్, నగర కన్వీనర్ ఎల్లబోయిన మహేష్, నగర గోరక్ష ప్రముఖ్ వంశీ, నగర విద్యార్థి ప్రముఖ్ సంతోష్, నగర సహా సంయోజక్ రంజిత్, అలిమిల్ల సతీష్, నగర సత్సంగ్ ప్రముఖ్ వంగర ఆంజనేయులు,భజరంగ్ దళ్ నగర కన్వీనర్ మహేష్ యాదవ్,అఖిల్,అశోక్,సతీష్ తదితరులు పాల్గొన్నారు
